బెంగాల్‌లో బీజేపీ దూకుడు | In West Bengal, BJP takes up void left by Left, Congress | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో బీజేపీ దూకుడు

Aug 19 2017 4:02 PM | Updated on Sep 17 2017 5:42 PM

బెంగాల్‌లో బీజేపీ దూకుడు

బెంగాల్‌లో బీజేపీ దూకుడు

పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలు, కాంగ్రెస్‌ల స్థానంలో బీజేపీ కీలక శక్తిగా అవతరించనుందా అనే చర్చకు తెర లేచింది.

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలు, కాంగ్రెస్‌ల స్థానంలో బీజేపీ కీలక శక్తిగా అవతరించనుందా అనే చర్చకు తెర లేచింది. ఇటీవల వెల్లడైన ఏడు మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ఇదే అంశాన్ని ముందుకుతెచ్చాయి. 2012లో ధూప్‌గురి మున్సిపాల్టీలో కేవలం 8.6 శాతం ఓట్లు తెచ్చుకున్న ఆ పార్టీ తాజాగా వెల్లడైన స్దానిక ఎన్నికల ఫలితాల్లో ఏకంగా 41.7 శాతం ఓట్లు సాధించింది. దళితులు అధికంగా ఉన్న ధూప్‌గిరిలో బీజేపీకి ఈ స్ధాయిలో ఓట్లు పోలవడం విశ్లేషకులను సైతం నివ్వెరపరిచింది. హల్దియా, ధూప్‌గురి, పన్సుకురా మున్సిపాల్టీల్లో వామపక్షాలు, కాంగ్రెస్‌లు కలిసి సాధించిన ఓట్ల కన్నా బీజేపీ ఓటింగ్‌ శాతం అధికం కావడం గమనార్హం.

దుర్గాపూర్‌, నల్హాటి మున్సిపాల్టీల్లో బీజేపీ రెండో స్ధానంలో నిలవగా, కూపర్స్‌ క్యాంప్‌లో వామపక్షాలకు దీటుగా ఓట్లు సాధించింది. పశ్చిమ బెంగాల్‌లో ఓటర్లను ఆకట్టుకునే నేత, పటిష్టమైన క్యాడర్‌ లేకున్నా 2014 లోక్‌సభ ఎన్నికల అనంతరం బీజేపీ ప్రజల్లో పట్టు పెంచుకుంటున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement