‘పద్మావత్‌’ విడుదలైతే ప్రజా కర్ఫ్యూ: రాజ్‌పుత్‌ వర్గం | if padmavath movie release, we will go for agigation : rajputh | Sakshi
Sakshi News home page

‘పద్మావత్‌’ విడుదలైతే ప్రజా కర్ఫ్యూ: రాజ్‌పుత్‌ వర్గం

Jan 11 2018 3:29 AM | Updated on Aug 9 2018 7:28 PM

న్యూఢిల్లీ: వివాదాస్పద ‘పద్మావత్‌’చిత్రం విడుదలైతే థియేటర్లలో ప్రజా కర్ఫ్యూ చేపడతామని రాజ్‌పుత్‌ కర్ణిసేన బుధవారం మరోసారి హెచ్చరించింది. ఆ చిత్రంపై పూర్తిగా నిషేధం విధించాలని పునరుద్ఘాటించింది. చరిత్రను వక్రీకరించి ఈ సినిమా తీశారని, నిర్మాతలతో తాము రాజీపడబోమని ఆ సంస్థ నాయకుడు లోకేంద్ర సింగ్‌ కల్వి అన్నారు. ‘పద్మావత్‌ను జనవరి 25న విడుదల చేయబోతున్నట్లు విన్నాం. అదే జరిగితే వీధుల వెంట ఆందోళనలు చేస్తాం. థియేటర్లలో పబ్లిక్‌ కర్ఫ్యూ నిర్వహించాలని యువతను కోరుతాం’అని కల్వి విలేకర్లతో చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement