వేరే రాష్ట్రాల్లో ఆకస్మిక పర్యటనలు వద్దు

Home ministry tells CMs to stop surprise trips to other states - Sakshi

న్యూఢిల్లీ:  వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలాంటి సమాచారం లేకుండా వేరే రాష్ట్రాల్లో అకస్మాత్తుగా పర్యటిస్తుండటంపై కేంద్ర హోంశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పర్యటనల వల్ల సదరు సీఎంలకు భద్రతాపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రులందరికీ తెలియజేయాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది.  ముందుగా సమాచారం ఇస్తే ఆతిథ్య సీఎంకు తగిన భద్రత కల్పించడం వీలవుతుందని తెలిపింది. సీఎంలకు జెడ్‌(22 మందితో), జెడ్‌ ప్లస్‌(55 మందితో) భద్రత కల్పిస్తారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top