2014 -సాధారణ బడ్జెట్ హైలైట్స్

2014 -సాధారణ బడ్జెట్ హైలైట్స్ - Sakshi


న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ఉదయం 11 గంటలకు లోక్ సభలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి దేశ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అంతకు ముందు బడ్జెట్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.


* పాదరక్షల ధరలు తగ్గే అవకాశం

* 19 ఇంచ్లు టీవీలు

* పొగాకు ఉత్పత్తులపై 12 నుంచి 16 శాతం ఎక్సైజ్ సుంకం పెంపు

* రేడియో టాక్సీలపై సేవా పన్ను

* తగ్గనున్న కంప్యూటర్, మొబైల్ ఫోన్ల ధరలు

* ఇనుము ధరలు తగ్గే అవకాశం

* దేశంలో మరో 60 ఆదాయ పన్ను సేవా కేంద్రాలు

* సున్నపురాయి, డోలమైట్ పై రాయితీ

* సిగరెట్ల పై కూడా భారీగా వడ్డింపు

* గుట్కా, పాన్ మసాలపై 60 శాతం పన్ను పెంపు

*  వజ్రాల ధర తగ్గింపు

* ఎలక్ట్రానిక్ వస్తువులపై ఎడ్యుకేషన్ సెస్

* పెట్రో కెమికల్స్ పై కస్టమ్స్ తగ్గింపు

* స్టెయిన్ లెస్ స్టీల్ వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ పెంపు

* పవన విద్యుత్ పరికరాలపై పన్ను తగ్గింపు

* ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీల ధర తగ్గింపు

* కలర్ టీవీ పిక్చర్ ట్యూబ్పై పన్ను తగ్గింపు

* ఫ్యాటీ ఆసిడ్స్, గ్లిజరిన్ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ తొలగింపు

* ఉన్ని దుస్తులపై కస్టమ్స్ డ్యూటీ తొలగింపు

* గృహ రుణాల ఆదాయపన్ను పరిమితి లక్ష నుంచి రెండు లక్షలకు పెంపు

* 80 సీసీ  పరిమితి రూ.1.5 లక్షలకు పెంపు

* సర్ ఛార్జీల్లో మార్పు చేయని జైట్లీ

* పొదుపు పథకాల్లో లక్షన్నర వరకూ పన్ను మినహాయింపు

* హైదరాబాద్ లో రుణాల వసూళ్లకు ట్రిబ్యునల్

* సీనియర్ సిటిజన్లకు పన్ను పరిమితి రూ.3లక్షలకు పెంపు

* వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి రూ. 2 లక్షల నుంచి 2.5లక్షలకు పెంపు

* హిందూపూర్ జాతీయ ఎక్సైజ్, కస్టమ్స్ అకాడమీ

* సెజ్ ల పునరుద్దరణకు సమగ్ర చర్యలు

* ప్రణాళికేతర వ్యయం రూ.12,90819 కోట్లు

* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

* టూరిజం అభివృద్ధికి రూ.500 కోట్లు

* మహిళల రక్షణకు నిర్బయ ఫండ్

* అమరవీరుల స్మారకార్థం వార్ మ్యూజియంకు రూ.

* మావోయిస్టు ప్రాంతాల్లో బలగాల ఆధునీకరణకు రూ.3వేల కోట్లు

* గంగానది ప్రక్షాళనకు రూ.2,037 కోట్లు

* రైతులకు మూడు శాతం వడ్డీతో పంట రుణాలు

* రక్షణ రంగానికి రెండు లక్షల ఇరవై తొమ్మిదివేల కోట్లు కేటాయింపు

* పీపీఎఫ్ పరిమితి లక్ష నుంచి లక్షన్నరకు పెంపు

* డిసెంబర్ 31 నాటికి అన్ని మంత్రిత్వ కార్యాలయాలు అనుసంధానం

* సకాలంలో ముంబై-బెంగళూరు కారిడార్ పూర్తి

* గంగానదిలో జలరవాణా కోసం రూ.4వేల కోట్లు

* జమ్మూ,కాశ్మీర్లో హస్తకళలకు రూ.50వేల కోట్లు

* లక్నో, అహ్మదాబాద్ లకు మెట్రో ప్రాజెక్టులు

* రూ.11,635 కోట్లతో పోర్టుల అభివృద్ధి

* బాలికల సాధికారిత కోసం రూ.100 కోట్లు

* బెనారస్ సిల్క్ అభివృద్ధికి రూ.50 కోట్లు

* తక్కువ వడ్డీకే రైతులకు స్వల్పకాలిక రుణాలు

* వ్యవసాయ రుణాల కోసం రూ.8వేల కోట్లు

* రక్షణ మంచినీటి పథకం కోసం రూ.6,500 కోట్లు

* ద్రవ్యోల్బణం కట్టడికి ధరల స్థిరీకరణ నిధి

* పీపీసీ పద్ధతిలో ఎయిర్ పోర్టుల అభివృద్ధి, విస్తరణ

* పట్టణాలలో రైతు మార్కెట్లు ఏర్పాటు

* పుడ్ సెక్టార్లో పీపీసీలు ప్రోత్సహిస్తాం

* పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.28వేల కోట్లు

* ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధికి రూ.50వేల కోట్లు

* 16 కొత్త నౌకాశ్రయాల అభివృద్ధి

* ఫుడ్ కార్పొరేషన్ ఇండియాలో సంస్కరణలు

* చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.200 కోట్లతో కార్ఫస్ ఫండ్

* భూసార పరీక్ష కేంద్రానికి రూ.56 కోట్లు

* ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి

* కృష్ణపట్నంలో ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు

* విశాఖ నుంచి చెన్నై వరకూ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు

* రైతుల కోసం కిసాన్ టెలివిజన్ ఛానల్ ఏర్పాటుకు రూ.100 కోట్లు

* ఈ ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా జీఎస్టీ

* సూరత్, రాయ్ బరేలీ, తమిళనాడులో టెక్స్ టైల్ పార్కులు

* వాతావరణంలో అనూహ్య మార్పులను ఎదుర్కొనేందుకు రూ.100 కోట్లు

* మూలధనం పెంపుకు జాతీయ బ్యాంకుల వాటా అమ్మకం

* నాబార్డు ద్వారా 5లక్షల మంది భూమిలేని రైతులకు ఆర్థిక సాయం

* తక్కువ ధరలకే ఇళ్లు నిర్మించేందుకు ప్రత్యేక చర్యలు

* సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు ప్రోత్సాహాలు

* ఆంధ్రప్రదేశ్, హర్యానాలో అగ్రికల్చరల్ యూనివర్సిటీలు

* హార్డ్వేర్ తయారీ లక్ష్యంగా కాకినాడ పోర్టు అభివృద్ధి

* 2022 నాటికి అందరికీ ఇళ్లు

* గోదాముల కోసం రూ.5కోట్లు

* తెలంగాణలో హార్టీకల్చర్ యూనివర్సిటీ

* ఆన్ లైన్ విద్యా బోధనకు రూ.100 కోట్లు

* గిరిజనుల కోసం వనబంధు పథకానికి రూ.100 కోట్లు

* సర్వశిక్ష అభియాస్ కు రూ.28,635 కోట్లు

* 2019 నాటికి పరిశుభ్ర భారత్

* సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి రూ.6000 కోట్లు

* గ్రామీణ విద్యుద్దీకరణకు రూ.500 కోట్లు

* మహిళల భద్రతకు రూ.150 కోట్లు

* దశలవారీగా ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటు

* పబ్లిక్ ట్రాన్స్ పోర్టుల్లో మహిళల భద్రతకు రూ.50 కోట్లతో పైలట్ ప్రాజెక్ట్

* యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్ ఇండియా కార్యక్రమం

* మదర్సాల అభివృద్ధికి రూ.100 కోట్లు

* ఈ-క్రాంతి పథకం ద్వారా గ్రామాల్లో ఇంటర్నెట్లకు 500 కోట్లు

* కొత్తగా 12 వైద్య, దంత కళాశాలలు

* కమ్యూనిటీ రేడియో స్టేషన్ల అభివృద్ధికి రూ.100 కోట్లు

* నగరాల్లో మెట్రో పనుల కోసం రూ.100కోట్లు

* ఈపీఎఫ్ వడ్డీరేట్లు పెంపు కోసం

* బాలిక రక్షణ కోసం రూ.100 కోట్లు

* వాటర్ షెడ్ ప్రోగ్సామ్స్ కి 2,142 కోట్లు

* గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం రూ.3,600 కోట్లు

* గృహ నిర్మాణ పథకానికి రూ.800 కోట్లు

* ఎంపిక చేసిన రంగాల్లో ఎఫ్డీఐలకు ప్రోత్సహం

* ఆంధ్రప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల్లో కొత్త ఐఐటీలు

* గ్రామీణ రహదారుల అభివృద్ది కోసం 14,389 కోట్లు

* గుజరాత్ తరహా పట్టణీకరణకు చర్యలు

* ఎస్సీ, ఎస్టీ ప్రణాళికకు 50వేల కోట్లు

* పెట్టుబడుల కోసం స్నేహపూరిత విధానం

* సర్దార్ ఏక్తా విగ్రహానికి 200 కోట్లు

* గ్రామ్ జ్యోతి పథకానికి రూ.500 కోట్లు

* ఇందిరా వికాస్ పత్రాల ద్వారా పెట్టుబడుల

* సుస్థిరమైన పన్నుల వ్యవస్థకు రూపకల్పన

* ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు కఠిన చర్యలు

* గృహ అవసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా

* ప్రధానమంత్రి నీటిపారుదల పథకానికి వెయ్యి కోట్లు

* వ్యయ-యాజమాన్య కమిషన్ ఏర్పాటు

* పర్యాటక రంగం ప్రోత్సాహానికి 9 ఎయిర్ పోర్టుల్లో ఈ-వీసాలకు అనుమతి

* త్వరలో కొత్త యూరియా పాలసీ

* ఎనిమిది శాతం వృద్ధిరేటు లక్ష్యం

* ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా లేవు

* 7060 కోట్లతో 100 స్మార్ట్ సిటీలు

* ట్యాక్స్ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ

* తయారీ రంగంలో  ఎఫ్డీఐలు అభివృద్ధికి ఆశాదీపాలు

* బీమా రంగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉంది

* బీమా రంగంలో 49 శాతం ఎఫ్డీఐలకు కృషి

* ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2లక్షల కోట్ల పెట్టుబడులు

* నల్లధనం దేశానికి శాపంగా మారింది

* మధ్య తరగతి ప్రజల జీవితాలను మార్చటమే లక్ష్యం

* గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు తగ్గిస్తాం

* రెండేళ్లుగా ద్రవ్యోల్బణం వెంటాడుతోంది

* అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది

* ద్రవ్యలోటు 4.1 శాతానికి తీసుకు వస్తాం

* అర్హులకే సబ్సీడీలు అందేలా చర్యలు

* రక్షణ, బీమా రంగంలో 41 శాతం ఎఫ్డీఐ

* రెండు,మూడేళ్లలో 7-8 శాతం వృద్ధిరేటు

* 2015 ద్రవ్యలోటు 3.6 శాతం

* భవిష్యత్ తరాలకు రుణభారాలు మిగల్చరాదు

* అవసరానికి మించి ఖర్చులు చేయలేం

* పన్ను వసూళ్లు మెరుగు పరచాలి

* పన్ను, జీడీపీ రేటును పెంచాలి

*  అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్

* బ్లాక్ మనీని అరికట్టేందుకు ప్రయత్నం

* భారత్ మార్పు కోరుకుంటుంది

* ఈ బడ్జెట్ నుంచి అతిగా ఆశించవద్దు

* రానున్న కాలంలో ద్రవ్యోల్బణం తగ్గుతుందని భావిస్తున్నాం

* గత ప్రభుత్వాల నిర్ణయాల్లో లోపాల వల్ల అవకాశాలు కోల్పోయం

*దారిద్ర్య రేఖ నుంచి బయటకు రావటానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top