అన్ని ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్‌ | High alert across all airports ahead of Republic Day | Sakshi
Sakshi News home page

అన్ని ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్‌

Jan 11 2017 11:15 AM | Updated on Apr 8 2019 8:07 PM

కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్నివిమానాశ్రయాల్లో హై అలర్ట్‌ ప్రకటించింది.

న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్‌ ప్రకటించింది. జనవరి 26 రిపబ్లిక్‌ డే సందర్భంగా ఉగ్రవాదులు కుట్ర పన్నే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాల హెచ్చరికలు చేశాయి. జనవరిలో అత్యంత్ర అప్రమత్తంగా ఉండాలని ఐబీ సూచించింది. 

ఈ వేడుకల సందర్బంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. రిపబ్లిక్ డే వేడుకలలో దాడులు జరగవచ్చనని నిఘా వర్గాలు ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలను హెచ్చరించాయి. దీంతో కేంద్రం దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement