ఐదు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌

Heavy Rains Expected Over The Next 48 Hours In Tamil Nadu - Sakshi

సాక్షి, చెన్నై : రానున్న 48 గంటల్లో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నీలగిరి, కోయంబత్తూరు, తిరునెల్వేలి, తేని, దిండిగల్‌ జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

దీంతో ఆ ఐదు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ను ప్రకటించారు. చెన్నై, కాంచీపురం, తిరువళ్లురు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.అండమాన్‌, మధ్య, ఉత్తర బంగాళాఖాతంతో పాటు, కావేరీ నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top