హెడ్‌కానిస్టేబుల్‌ను కాల్చి చంపిన కానిస్టేబుల్ | Head Constable killing by Constable | Sakshi
Sakshi News home page

హెడ్‌కానిస్టేబుల్‌ను కాల్చి చంపిన కానిస్టేబుల్

Mar 8 2015 3:12 AM | Updated on Mar 19 2019 5:52 PM

ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని సుకుమా జిల్లాలో హెడ్ కానిస్టేబుల్‌ను కానిస్టేబుల్ కాల్చిచంపాడు.

చింతూరు: ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని సుకుమా జిల్లాలో హెడ్ కానిస్టేబుల్‌ను కానిస్టేబుల్ కాల్చిచంపాడు. సుకుమా జిల్లా ధర్మపెంటలోని ఛత్తీస్‌గఢ్ ఆర్మ్‌డ్ ఫోర్స్ క్యాంపులో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. హెడ్ కానిస్టేబుల్ అయోధ్యప్రసాద్ దేశ్‌ముఖ్, కానిస్టేబుల్ సమీర్ కృష్ణతీర్థల మధ్య ఓ ఘటనకు సంబంధించి వివాదం మొదలై కొట్లాడుకునే వరకూ వెళ్లింది.  సమీర్ ఆగ్రహంతో తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చడంతోప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement