ఉపరాష్ట్రపతి, ప్రధాని హోళీ శుభాకాంక్షలు | Sakshi
Sakshi News home page

ఉపరాష్ట్రపతి, ప్రధాని హోళీ శుభాకాంక్షలు

Published Fri, Mar 6 2015 1:30 AM

happy holi says modi and ansari

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీలు దేశ ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల పండుగ భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నమని అన్సారీ తన సందేశంలో పేర్కొన్నారు. వసంత రుతువు రాకకు సూచిక అయిన హోళీని జాతి, మత, ప్రాంతాలకు అతీతంగా దేశ ప్రజలందరూ వేడుకగా జరుపుకోవాలని కోరారు. 'ఈ రంగుల పండుగ మీజీవితాల్లో ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నాను' అని ప్రధాని ట్వీట్ చేశారు.

Advertisement
Advertisement