సెలవుల్లో మావయ్య ఇంట్లో గడిపేందుకు వెళ్లి.. | Gujarat: Leopard mauls minor girl | Sakshi
Sakshi News home page

సెలవుల్లో మావయ్య ఇంట్లో గడిపేందుకు వెళ్లి..

May 16 2016 9:06 PM | Updated on Apr 8 2019 7:51 PM

వేసవి సెలవుల్లో తన అంకుల్ ఇంటివద్ద గడిపేందుకు వెళ్లిన ఎనిమిదేళ్ల బాలిక జీవితం విషాధంగా మారింది. తన మేనమామ పొలంలో ఆడుకుంటున్న జిగ్నా గోహిల్ అనే బాలికపై చిరుతపులి దాడి చేసి చీరేసింది.

వడోదర: వేసవి సెలవుల్లో తన అంకుల్ ఇంటివద్ద గడిపేందుకు వెళ్లిన ఎనిమిదేళ్ల బాలిక జీవితం విషాధంగా మారింది. తన మేనమామ పొలంలో ఆడుకుంటున్న జిగ్నా గోహిల్ అనే బాలికపై చిరుతపులి దాడి చేసి చీరేసింది. తీవ్రగాయాలతో ఆ బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుజరాత్లోని సోమనాథ్ గిర్ జిల్లాలోగల సనాఖడ అనే గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సోమవారం సాయంత్రం తన మావయ్య పొలంలోని మామిడితోటలో ఆడుకునేందుకు వెళ్లిన బాలికపై ఓ చిరుత దాడి చేసి చంపేసింది. రాత్రి సమయంలో కూడా బాలిక రాకపోవడంతో వెతికి చూడగా చిరుత దాడి చేసిన విషయం తెలిసింది. తీవ్రగాయాలతో ఉన్న బాలిక ప్రాణాలతో ఉందేమోనన్న ఆశతో ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement