
న్యూఢిల్లీ: 14 రాష్ట్రాల్లో గత నెలలో కేంద్రం ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టిన రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పథకాన్ని వచ్చే నెలనుంచి ఆంధ్రప్రదేశ్తో పాటు 5 రాష్ట్రాల్లో అమలు చేయనుంది. ఇందులో భాగంగా ఎరువుల రాయితీని నేరుగా రైతుల ఖాతాలోకే ప్రభుత్వం జమ చేయనుంది. ఈ మేరకు కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు తెలిపారు. ప్రతియేటా రూ. 70వేల కోట్ల ఎరువులను కేంద్రం రైతులకు సబ్సిడీమీద అందజేస్తోంది. వచ్చే నెల నుంచి పంజాబ్, హరియాణా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఏపీలోని రైతులకు ఈ డీబీటీ పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి తెలిపారు.