డీజిల్‌ ధర రూ. 2-3 పెంపునకు కేంద్రం యోచన! | Govt mulls one-time diesel price hike of Rs 2-3 per litre | Sakshi
Sakshi News home page

డీజిల్‌ ధర రూ. 2-3 పెంపునకు కేంద్రం యోచన!

Aug 15 2013 5:18 AM | Updated on Sep 28 2018 3:22 PM

డీజిల్‌ ధర రూ. 2-3 పెంపునకు కేంద్రం యోచన! - Sakshi

డీజిల్‌ ధర రూ. 2-3 పెంపునకు కేంద్రం యోచన!

అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి మారకం విలువ భారీగా పతనం కావడంతో డీజిల్ ధరలను ఒకేసారి లీటరుకు 2-3 రూపాయల చొప్పున పెంచాలని కేంద్రం యోచిస్తోంది. hike

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి మారకం విలువ భారీగా పతనం కావడంతో డీజిల్ ధరలను ఒకేసారి లీటరుకు 2-3 రూపాయల చొప్పున పెంచాలని కేంద్రం యోచి స్తోంది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ఇప్పటికే ప్రతినెలా 50 పైసల మేర డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్నా మే నుంచి రూపాయి విలువ 12 శాతం క్షీణించడంతో ప్రస్తుతం లీటరు డీజిల్‌పై రూ. 9.29 చొప్పున నష్టపోతున్నాయి. దీంతో ఈ నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఏకమొత్తంగా రూ. 2-3 వరకూ పెంచాలని కేంద్రాన్ని కోరాయి. ఈ ప్రతిపాదన తమ పరిశీలనలో ఉందని, నిర్ణయం ఇంకా తీసుకోలేదని చమురుశాఖ మంత్రి వీరప్ప మొయిలీ బుధవారం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement