ఏమీ లేదబ్బా..రొటీన్ మీటింగ్ | governor narasimhan meets rajnath singh to discuss section 8 and cash-for-vote scam | Sakshi
Sakshi News home page

ఏమీ లేదబ్బా..రొటీన్ మీటింగ్

Jun 26 2015 12:18 PM | Updated on Aug 21 2018 11:41 AM

ఏమీ లేదబ్బా..రొటీన్ మీటింగ్ - Sakshi

ఏమీ లేదబ్బా..రొటీన్ మీటింగ్

కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో గవర్నర్ నరసింహన్ భేటీ ముగిసింది. ఓటుకు కోట్లు కేసుకు సంబంధించిన నివేదికతో పాటు ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన పలు ..

న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో గవర్నర్ నరసింహన్ భేటీ ముగిసింది.  ఓటుకు కోట్లు కేసుకు సంబంధించిన నివేదికతో పాటు ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన పలు అంశాలపై తన నివేదికలను గవర్నర్‌ ఈ సందర్భంగా హోంశాఖకు అందించినట్లు సమాచారం.

రాజ్నాథ్ సింగ్తో నరసింహన్ సమావేశం సుమారు 45 నిమిషాల పాటు కొనసాగింది. కాగా రాజ్నాథ్తో భేటీ అనంతరం గవర్నర్ నరసింహన్ను భేటీ వివరాలపై మీడియా ప్రతినిధులు అడగగా ఏమీ లేదబ్బా... రొటీన్ మీటింగ్... నథింగ్ సెన్సేషనల్ అంటూ మాట్లాడకుండా వెళ్లిపోయారు.  అంతకు ముందు ఆయన హోంశాఖ అధికారులతో భేటీ అయ్యారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement