ఇంటి పైకప్పు కూలి ఐదుగురు మృతి | Five of a family killed in house collapse | Sakshi
Sakshi News home page

ఇంటి పైకప్పు కూలి ఐదుగురు మృతి

Jul 9 2015 2:49 PM | Updated on Apr 4 2019 5:24 PM

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్లో ఓ ఇంటి పై కప్పు కూలిపోయి ఐదుగురు మృతిచెందారు. ఒకరు గాయాలపాలయ్యారు.

డెహ్రాడూన్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్లో ఓ ఇంటి పై కప్పు కూలిపోయి ఐదుగురు మృతిచెందారు. ఒకరు గాయాలపాలయ్యారు. చనిపోయిన ఐదుగురు అదే ఇంటి వారు కావడంతో తీవ్ర విషాదం అలుముకుంది. రాష్ట్రంలోని పౌరి జిల్లాలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాలోని మేరా అనే గ్రామంలో ఓ కుటుంబీకులంతా తమ ఇంట్లో గాడ నిద్రలో ఉండగా ఒక్కసారిగా అర్థరాత్రి ఆ ఇంటి పైకప్పు కూలి మీదపడింది. చనిపోయిన వారిలో ఇంటి యజమాని ఆయన భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు మరొకరు చనిపోగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement