
ఉత్తరప్రదేశ్ మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు
సుప్రీంకోర్టు ఆదేశాలతో యూపీ మంత్రి గాయత్రీ ప్రజాపతి, అతని ఆరుగురు అనుచరులపై యూపీ పోలీసులు శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
లక్నో: సుప్రీంకోర్టు ఆదేశాలతో యూపీ మంత్రి గాయత్రీ ప్రజాపతి, అతని ఆరుగురు అనుచరులపై యూపీ పోలీసులు శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఓ మహిళను గ్యాంగ్రేప్చేసి, ఆమె కూతురినీ చెరబట్టాలని చూశారనే ఆరోపణలపై వివిధ సెక్షన్లు, పోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ) చట్టం కింద నిందితులపై కేసులు నమోదయ్యాయి.
బాధితురాలి కథనం ప్రకారం 2014 అక్టోబరు నుంచి 2016 జూలై వరకు పలుమార్లు మంత్రి, అనుచరులు కలిసి ఆమెను రేప్ చేశారు. తర్వాత ఆమె కూతరుపైనా దుర్మార్గులు కన్నేయడంతో బాధితురాలు 2016 అక్టోబరులో రాష్ట్ర డీజీపీని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. అయినా నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడంతో ఆమె న్యాయం కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.