ఇద్దరు భారతీయులకు ఓజోన్‌ అవార్డు | Ex-environment min among 2 Indians honoured with Ozone award | Sakshi
Sakshi News home page

ఇద్దరు భారతీయులకు ఓజోన్‌ అవార్డు

Nov 25 2017 3:10 AM | Updated on Nov 25 2017 3:10 AM

Ex-environment min among 2 Indians honoured with Ozone award - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర పర్యావరణశాఖ మాజీ మంత్రి అనిల్‌ దవే, సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌(సీఎస్‌ఈ) డిప్యూటీ డైరెక్టర్‌ చంద్ర భూషణ్‌లు ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమంలో భాగంగా అందించే ఓజోన్‌ అవార్డులు అందుకున్నారు. రువాండాలో గత ఏడాది కిగాలీ ఒప్పందం కుదరడంలో దవే చొరవకు గుర్తింపుగా ఆయనకు మరణానంతరం ‘రాజకీయ నాయకత్వ అవార్డు’ను ప్రకటించారు.  దవే తరఫున భారత పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి  అవార్డు స్వీకరించారు. కిగాలీ ఒప్పందంలో కీలకంగా వ్యవహరించినందుకు చంద్రభూషణ్‌కు భాగస్వామ్య అవార్డు లభించింది.

Advertisement
 
Advertisement
Advertisement