యంత్రాంగమే ఎదుర్కోగలదు

Disasters and epidemics can be best handled by executive  - Sakshi

సీజేఐ జస్టిస్‌ బాబ్డే

న్యూఢిల్లీ: దేశంలో విపత్తులు సంభవించినప్పుడు, అంటువ్యాధులు ప్రబలినప్పుడు వాటిని కార్యనిర్వాహక వ్యవస్థే సమర్థంగా ఎదుర్కోగలదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే స్పష్టం చేశారు. సంక్షోభాల్లో ‘ప్రజలు, ధనం, వస్తుసామగ్రి’ని ప్రాధాన్యతా క్రమంలో వినియోగించుకోవడం ఎలా అనేది యంత్రాంగమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. సంక్షోభ సమయాల్లోనూ కోర్టులు పనిచేస్తాయనీ, యంత్రాంగం చేపట్టిన చర్యల కారణంగా పౌరులకు అపాయం వాటిల్లినప్పుడు జోక్యం చేసుకుంటాయని సీజేఐ స్పష్టం చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top