హైడ్రోకర్భన నిక్షేపాల తాజా వాస్తవ నిల్వలను నిర్ధారించుకునేందుకు ఎన్ఎస్పీను కేంద్రం ప్రారంభించింది.
భువనేశ్వర్: దేశంలో హైడ్రోకర్భన నిక్షేపాల తాజా వాస్తవ నిల్వలను నిర్ధారించుకునేందుకు నేషనల్ సీస్మిక్ ప్రోగ్రామ్(ఎన్ఎస్పీ)ను కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం ఒడిశాలోని బాలాసోర్ జిల్లా తరంగ్లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో భూగర్భ తైల, సహజ వాయువు వనరుల అన్వేషణ తమ ప్రధాన లక్ష్యమని ప్రధాన్ అన్నారు. దేశంలో దాదాపు పాతికేళ్ల తర్వాత రూ. 5,000 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభించామన్నారు.