నోట్లను ముట్టుకుంటే ఒట్టు

Corona Fear People Back step to Take Money on Road in Karnataka - Sakshi

కర్ణాటక ,మండ్య: కరోనా భయం వల్ల వీధిలో పడి ఉన్న రూ. 500 నోట్లను ఎవరూ ముట్టుకోకుండా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన మండ్య జిల్లా పాండవపుర పట్టణంలో జరిగింది. పట్టణంలోని గాణిగర వీధిలో రూ. 500 నోట్లు 6 పడి ఉండడం కొందరు చూశారు.  ఆ నోట్లకు కరోనా వైరస్‌ అంటుకుని ఉంటుందని, ముట్టుకుంటే తమకు వస్తుందని స్థానికులు భయపడ్డారు. ఎస్‌ఐ సుమారాణి, పోలీసులు వచ్చి నోట్లకు శానిటైజ్‌ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా పోగొట్టుకుని ఉంటే పోలీసు స్టేషన్‌కు వచ్చి తీసుకెళ్లాలని సూచించారు.(సారీ.. హలీమ్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top