కరోనా.. భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు | Corona Death Toll Rises To 3867 In India | Sakshi
Sakshi News home page

భారత్‌లో లక్షా ముప్పైవేలు దాటిన కరోనా కేసులు

May 24 2020 9:34 AM | Updated on May 24 2020 12:05 PM

Corona Death Toll Rises To 3867 In India - Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 6,767 కరోనా కేసులు నమోదు కాగా, 147 మంది మృతిచెందారు. ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,31,868కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు 54,440 మంది కరోనా నుంచి కోలుకోగా, 3,867 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 73,560 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. మహారాష్ట్ర, తమిళనాడులలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. మహారాష్ట్రలో 47,190 కరోనా కేసులు నమోదు కాగా, 13,404 కోలుకున్నారు. 1,577 మంది మృతిచెందారు. మరోవైపు తమిళనాడులో 15,512, గుజరాత్‌లో 13,664, ఢిల్లీలో 12,910 కరోనా కేసులు నమోదయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement