మళ్లీ పరీక్ష నిర్వహించాలి: ఇంటర్ విద్యార్థులు | Class 12 students protest over Physics paper | Sakshi
Sakshi News home page

మళ్లీ పరీక్ష నిర్వహించాలి: ఇంటర్ విద్యార్థులు

Mar 4 2017 6:37 PM | Updated on Apr 3 2019 4:37 PM

ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్ పేపర్ లో సిలబస్ లోలేని ప్రశ్నలు అడిగారని జమ్మూ విద్యార్థులు జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని దిగ్భాందించారు.

జమ్మూ: ఇంటర్ ద్వితీయ సంవత్సరం  ఫిజిక్స్ పేపర్ లో సిలబస్ లోలేని ప్రశ్నలు అడిగారని జమ్మూ విద్యార్థులు జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని దిగ్భాందించారు. ఇంటర్ బోర్డు సిలబస్ లోలేని ప్రశ్నలు పరీక్షలో ఇచ్చిందని వారు తీవ్రంగా మండిపడ్డారు. స్కూల్ బోర్డు సిలబస్ లోలేని ప్రశ్నలు ఏ విధంగా ఇచ్చిందని ప్రశ్నించారు. 
 
ఫిజిక్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని వారు డిమండ్ చేశారు. పోలీసులకు చెందిన వాహనాలను విద్యార్థులు ధ్వంసం చేయడంతో వారిని  మా పర్యవేక్షణలోకి తీసుకున్నామని జమ్మూ డిప్యూటి కమీషనర్ సిమ్రన్ ధీప్ సింగ్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement