సీబీఐకి పదేళ్లుగా విశ్వసనీయతా లోపం: జైట్లీ | CBI suffered credibility gap in the past decade: Arun Jaitley | Sakshi
Sakshi News home page

సీబీఐకి పదేళ్లుగా విశ్వసనీయతా లోపం: జైట్లీ

Apr 19 2014 3:21 AM | Updated on Sep 2 2017 6:12 AM

సీబీఐకి పదేళ్లుగా విశ్వసనీయతా లోపం: జైట్లీ

సీబీఐకి పదేళ్లుగా విశ్వసనీయతా లోపం: జైట్లీ

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గత దశాబ్దకాలంలో విశ్వసనీయతా లోపంతో బాధపడిందని శుక్రవారం బీజేపీ నేత అరుణ్ జైట్లీ అన్నారు.

అమృత్‌సర్: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గత దశాబ్దకాలంలో విశ్వసనీయతా లోపంతో బాధపడిందని శుక్రవారం బీజేపీ నేత అరుణ్ జైట్లీ అన్నారు. రాజకీయ ప్రత్యర్థులను దోషులుగా నిలబెట్టేందుకు అధికార పార్టీ సీబీఐ డెరైక్టర్లను నియంత్రిస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. ‘సీబీఐ.. డెరైక్టర్ల ద్వారా నియంత్రణలో ఉండే సంస్థ. ఆ సంస్థ డెరైక్టర్లు స్వతంత్ర వ్యవస్థల ద్వారా కాకుండా ప్రభుత్వం ద్వారా నియమితులవుతున్నారు.
 
 అందువల్ల వారు ప్రభుత్వ నియంత్రణలో మాత్రమే కాకుండా అధికార పార్టీలోని కీలక వ్యక్తుల నియంత్రణలోనూ ఉంటున్నారు. రాజస్థాన్, గుజరాత్‌లలో బీజేపీ నేతలపై దాఖలైన అసమంజస చార్జిషీట్లను గమనిస్తే ఈ విషయం తెలుస్తుంది’ అని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ నిజాయితీతో ఉండాలని, సీబీఐ అధికారులు ఇతరుల కన్నా మరింత నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉందని జైట్లీ అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement