ఆడశిశువుల రక్షణ, ఆడపిల్లల విద్యపై నరేంద్ర మోడీ సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది. 'భేటీ బచావో-భేటీ పడావో' పేరుతో కొత్త పథకం ప్రకటించింది.
న్యూఢిల్లీ : ఆడశిశువుల రక్షణ, ఆడపిల్లల విద్యపై నరేంద్ర మోడీ సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది. 'భేటీ బచావో-భేటీ పడావో' పేరుతో కొత్త పథకం ప్రకటించింది. ఆడపిల్లలను రక్షించండి, చదివించండి పథకానికి రూ.500 కోట్లు నిధులు కేటాయించనున్నారు. అలాగే దేశంలో మహిళల భద్రత కోసం రూ.150 కోట్లు నిధులు ఖర్చు చేస్తామని అరుణ్ జైట్లో తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. అదేవిధంగా లింగ వివక్షకు వ్యతిరేకంగా పాఠశాలల్లో బోధనలో మార్పులు చేయనున్నట్లు తెలిపారు.
*నిర్భయ ఫండ్ నుంచి నిధులు
*ఢిల్లీలో మహిళా రక్షణకు ఎమర్జెన్సీ సెంటర్
*నగరాల్లో మహిళల రక్షణకోసం రూ. 150 కోట్లు
*బాలికా శిశుసంక్షేమ పథకాలకు మరిన్ని నిధులు
* బాలికల విద్య, వివాహాల కోసం నిర్దేశించిన పొదుపు పథకాలకు ప్రోత్సాహం
* మహిళల రుణాల కోసం 'ఆ జీవిక' పథకం