ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు | Bomb threat to Air India flight sparks security alert | Sakshi
Sakshi News home page

ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు

Oct 24 2014 2:21 PM | Updated on Aug 17 2018 6:15 PM

ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు - Sakshi

ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు

ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది.

కోచి: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ నెల 25న ముంబై నుంచి వచ్చే ఒక విమానాన్ని పేల్చేయడం లేదా వీలైతే ఆత్మాహుతి దాడి చేస్తారని కోచి విమానాశ్రయ అధికారులకు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు విమానాశ్రయం డైరెక్టర్ ఏకేసీ నాయర్ చెప్పారు.

శనివారం ముంబై నుంచి కోచి వచ్చే విమానం లేదా శుక్రవారం రాత్రి అహ్మదాబాద్-ముంబై సెక్టార్ విమానంపై దాడి చేయనున్నట్టు హెచ్చరికలు వచ్చాయి. గురువారం రాత్రి ఓ ఆగంతకుడు కోల్కతా విమానాశ్రయ అధికారికి ఫోన్ చేసి ఈ మేరకు బెదిరించాడు. ఆయన వెంటనే కోచి విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. సీఐఎస్ఎఫ్ డీఐజీ ఆనంద్ మోహన్ చెన్నై నుంచి కోచి చేరుకుని అత్యున్నత స్థాయి భద్రత సమావేశం నిర్వహించారు. కోచి విమానాశ్రయంలో భద్రత బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు.

Advertisement
 
Advertisement
Advertisement