ముంబై మురికివాడలో మహమ్మారి కలకలం.. | BMC Says Coronavirus Cases In Dharavi Jumped | Sakshi
Sakshi News home page

ముంబై మురికివాడలో​ కరోనా కలకలం

Apr 16 2020 6:44 PM | Updated on Apr 16 2020 7:06 PM

BMC Says Coronavirus Cases In Dharavi Jumped   - Sakshi

మహమ్మారి బారిన ఆసియాలో అతిపెద్ద మురికివాడ..

ముంబై : ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబైలోని ధారావిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ధారావిలో గురువారం 26 మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఈ ప్రాంతంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 86కు పెరిగింది. కరోనా వైరస్‌తో బాధపడుతూ ఓ వ్యక్తి చనిపోవడంతో ధారావి మురికివాడలో మృతుల సంఖ్య 9కి చేరిందని అధికారులు వెల్లడించారు. ధారావిలోని లక్ష్మీచాల్‌ ప్రాంతానికి చెందిన 58 సంవత్సరాల వ్యక్తి గురువారం మరణించారని బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారి తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ధారావిలో 15 లక్షల మంది నివసిస్తారు. కాగా, మహారాష్ట్రలో మొత్తం కోవిడ్‌-19 కేసుల సంఖ్య 2919కి చేరింది.

చదవండి : లాక్‌డౌన్‌: వాటినే ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేశారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement