పదోన్నతులపై నితీష్‌ కీలక నిర్ణయం | Bihar Government To Grant Reservation To SC ST | Sakshi
Sakshi News home page

బిహార్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

Jul 22 2018 3:10 PM | Updated on Sep 15 2018 3:01 PM

Bihar Government To Grant Reservation To SC ST - Sakshi

నితీష్‌ కుమార్‌ (ఫైల్‌ ఫోటో)

ఎస్సీ, ఎస్టీల​కు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పాట్నా : ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని బిహార్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.  ప్రభుత్వ అధికారుల సలహా మేర​కు సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. గత కొంత కాలంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాల్లో ప్రమోషన్లు కల్పించాలని ప్రభుత్వ భావిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీ సిపారసులకు మేరకు ప్రభుత్వం రిజర్వేషన్లలను కల్పిస్తూ ప్రకటన విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ తీసుకున్న ఈ నిర్ణయం  ఏమేరకు ప్రతిఫలం ఇస్తుందో వేచి చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement