జవాను కాల్పులు నలుగురి మృతి | Bihar: CISF jawan opens fire on colleagues, four killed | Sakshi
Sakshi News home page

జవాను కాల్పులు నలుగురి మృతి

Jan 13 2017 2:52 AM | Updated on Sep 5 2018 9:47 PM

కేంద్ర పారిశ్రామిక భద్రతా దళ(సీఐఎస్‌ఎఫ్‌) జవాను ఒకరు తన సీనియర్‌ సహచరులపై జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు.

ఔరంగాబాద్‌ : కేంద్ర పారిశ్రామిక భద్రతా దళ(సీఐఎస్‌ఎఫ్‌) జవాను ఒకరు తన సీనియర్‌ సహచరులపై జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. బిహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నబీనగర్‌ పవర్‌ జనరేటింగ్‌ కంపెనీ వద్ద విధులు నిర్వహిస్తున్న బల్వీర్‌ బుధవారం అర్ధరాత్రి సమయంలో డ్యూటీలు మారుతున్నప్పుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. సెలవుల విషయంలో తీవ్ర వాగ్వాదం తర్వాత తన రైఫిల్‌తో పాతిక రౌండ్ల కాల్పులు జరిపాడు. ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే చనిపోగా, గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. బల్వీల్‌ను జవాన్లు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. కాల్పులపై సీఐఎస్‌ఎఫ్‌ సైనిక విచారణకు ఆదేశించింది.  అలీగఢ్‌కు చెందిన బల్వీర్‌ మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇటీవల యోగా కోర్సు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement