జర్నలిస్టు హత్య వెనుక రాజకీయనేతల హస్తం! | Bihar: CBI files case in Rajdev Ranjan murder case | Sakshi
Sakshi News home page

జర్నలిస్టు హత్య వెనుక రాజకీయనేతల హస్తం!

Sep 16 2016 7:22 AM | Updated on Sep 4 2017 1:45 PM

బిహార్‌కు చెందిన హిందుస్తాన్‌ పత్రిక బ్యూరో చీఫ్‌ రాజ్‌దేవ్‌ రంజన్‌ హత్య వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉండొచ్చని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(పీసీఐ) అనుమానం వ్యక్తం చేసింది.

న్యూఢిల్లీ: బిహార్‌కు చెందిన హిందుస్తాన్‌ పత్రిక బ్యూరో చీఫ్‌ రాజ్‌దేవ్‌ రంజన్‌ హత్య వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉండొచ్చని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(పీసీఐ) అనుమానం వ్యక్తం చేసింది. రంజన్‌ రాసిన విమర్శనాత్మక కథనాలను జీర్ణించుకోలేక ఆయనను హత్య చేసి ఉంటారంది. పీసీఐ నియమించిన నిజనిర్ధారణ కమిటీ అందజేసిన నివేదికను అది ఆమోదించింది.

జార్ఖండ్‌లోని ఛత్రా టీవీ జర్నలిస్టు అఖిలేశ్‌ప్రతాప్‌సింగ్‌ హత్యపైనా నిజనిర్దారణ కమిటీ వేసింది. డబ్బుల కోసం డిమాండ్‌ చేసిన నక్సలైట్‌ గ్రూపు అఖిలేశ్‌ను హత్య చేసి ఉంటుందని కమిటీ అభిప్రాయపడింది.

Advertisement
 
Advertisement
Advertisement