
'ఆర్థికవ్యవస్థకు శాపంగా మారిన నల్లధనం'
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టే మందు ప్రసంగించారు. అరుణ్ జైట్లీ మాటల్లో ...
నల్లధనం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు శాపంగా మారిందని, దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. బడ్జెట్ను గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన తెలిపిన అంశాలిలా ఉన్నాయి.
* ప్రస్తుతం మనం రక్షణలో 25 శాతం ఎఫ్డీఐలు అమలుచేస్తున్నాం వాటిని 49 శాతానికి పెంచాలనుకుంటున్నాం
* బీమా రంగంలో కూడా 26 నుంచి 49 శాతం వరకు ఎఫ్డీఐలను పెంచాలనుకుంటున్నాం.
* పలు రంగాల్లో ఎఫ్డీఐల వల్ల స్వదేశీ ఉత్పత్తులు కూడా పెరుగుతాయి.
* మన దేశంలోని పలు రంగాల్లో ఉద్యోగాలు రావడం చాలా అవసరం
* మన స్వదేశీ ఉత్పాదక పరిస్థితులు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి.
* మన ఆర్థిక వ్యవస్థకు శాపంగా మారిన నల్లధనాన్ని అరికట్టాలి.
* పేదరికంలో ఉన్నవాళ్లు దాన్నుంచి బయట పడాలనుకుంటున్నారు. అందరికీ ఆశలు చాలా ఉన్నాయి.
* ద్రవ్యోల్బణాన్ని తగ్గించి, ఆహార ద్రవ్యోల్బణాన్ని కూడా తగ్గిస్తాం.
* నిరుద్యోగం, మౌలిక సదుపాయాల లేమితో బాధపడకూడదు.
* 7-8 శాతం వృద్ధిరేటు సాధించడానికి ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రారంభం మాత్రమే
* ప్రభుత్వం ఏర్పాటైన 45 రోజులకే ప్రవేశపెట్టే బడ్జెట్లో అద్భుతాలు చేస్తామని ఆశించక్కర్లేదు
* పేదరికం అతిపెద్ద సమస్య. దాన్ని తగ్గించడానికి పలు చర్యలు తీసుకుంటాం
* సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అన్న మోడీ నినాదానికి అనుగుణంగా చర్యలుంటాయి, బలమైన భారతాన్ని నిర్మిస్తాం
* రెండేళ్లుగా ద్రవ్యోల్బణం వెంటాడుతోంది.. దీంతో వేగంగా చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది
* మరిన్ని వనరులు సమకూర్చుకోవాల్సి ఉంది. పన్నులు- జీడీపీ నిష్పత్తిని మెరుగుపరుచుకోవాలి
* ఇన్నాళ్లూ ఖర్చులను తగ్గించుకున్నారు తప్ప ఆదాయాన్ని మెరుగుపరిచే చర్యలు పెద్దగా చేపట్టలేదు
* కృషిచేయడం ఆపేసినప్పుడే విఫలం అవుతాం.
* ఇరాక్ సంక్షోభం వల్ల, మధ్య ప్రాచ్య సమస్యల వల్ల చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి
* రుతుపవనాలు రాకపోవడంతో ద్రవ్యోల్బణం పెరుగుతోంది
* వ్యయ నిర్వహణ కమిషన్ ఒకదాన్ని ప్రవేశపెడతాం
* ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం
* పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే విధానాలను అమలుచేస్తాం
* 4 లక్షల కోట్ల పన్ను డిమాండ్ ఇప్పటికీ ఇంకా వివాదాల్లో ఉంది
* పన్ను చట్టాలను పటిష్ఠం చేసేందుకు సీబీడీటీ సూచనలతో ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేస్తాం