కరోనా బారిన మరో మొహల్లా క్లినిక్‌ డాక్టర్‌

Another Delhi Mohalla Clinic Doctor Has COVID-19 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో మరో మొహల్లా క్లినిక్‌కు చెందిన ఓ వైద్యుడికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా రిపోర్ట్‌ వచ్చింది. వారం కిందట మౌజీపూర్‌ మొహల్లా క్లినిక్‌ వైద్యుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, ఆయన భార్య, కుమార్తెకు సైతం నిర్వహించిన పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. ఆయనతో సన్నిహితంగా మెలిగిన 900 మందిని 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచారు. ఇక ఢిల్లీలోని మౌజీపూర్‌కు ఒక కిలోమీటర్‌ దూరంలోని బబార్పూర్‌లో తాజా కేసు వెలుగుచూసింది.

కాగా, ఈ క్లినిక్‌ను మార్చి 12 నుంచి 20 మధ్య సందర్శించిన రోగులందరినీ రానున్న 15 రోజులు ఇళ్లలో స్వీయ నిర్భంధంలోకి వెళ్లాలని అధికారులు సూచించారు. కాగా కరోనా బారిన పడిన వైద్యుడు విదేవీ ప్రయాణం చేసి వచ్చాడా లేదా విదేశాల నుంచి వచ్చిన వారితో సన్నిహితంగా మెలిగాడా అనేది ఇంకా వెల్లడికాలేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్‌ కేసులు 100 దాటగా, ఇద్దరు వ్యక్తులు మరణించారు.

చదవండి : కరోనా ఎఫెక్ట్‌: సీఎం వేతనం కట్‌!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top