
అన్నా డీఎంకే-సీపీఐ పొత్తు
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో అన్నా డీఎంకే, సీపీఐ కలిసి పోటీ చేయనున్నాయి. సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్దన్తో తన నివాసంలో భేటీ అనంతరం అన్నా డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి జయలలిత ఈ మేరకు వెల్లడించారు.
40 ఎంపీ స్థానాలు గెల్చుకుంటాం: జయ
చెన్నై: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో అన్నా డీఎంకే, సీపీఐ కలిసి పోటీ చేయనున్నాయి. సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్దన్తో తన నివాసంలో భేటీ అనంతరం అన్నా డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి జయలలిత ఈ మేరకు వెల్లడించారు. తమిళనాడులోని మొత్తం 39 ఎంపీ సీట్లతోపాటు పుదుచ్చేరిలోని ఒక సీటును గెల్చుకోవడమే ఈ పొత్తు లక్ష్యమని చెప్పారు. అన్నాడీఎంకే-లెఫ్ట్ కూటమి ఘనవిజయం సాధిస్తే.. జయలలిత ప్రధాని అయ్యే అవకాశాలను తోసిపుచ్చలేమని బర్దన్ అన్నారు.