వర్సిటీ విద్యార్థులపై రాజ్యద్రోహం కేసు | AMU Students Booked For Sedition On Prayer For Militant | Sakshi
Sakshi News home page

వర్సిటీ విద్యార్థులపై రాజ్యద్రోహం కేసు

Oct 13 2018 8:50 AM | Updated on Oct 13 2018 8:52 AM

AMU Students Booked For Sedition On Prayer For Militant - Sakshi

అలీగఢ్‌ యూనిర్సిటీలో పీహెచ్‌డీ చదువుతుండగా 2017 చివరన దక్షిణ కశ్మీర్‌కు చెందిన కొందరు విద్యార్థులతో ఏర్పడిన పరిచయంతో మిలిటెన్సీలో చేరాడు

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ (ఎఎమ్‌యూ) రాజ్యద్రోహం ఆరోపణలతో మరోసారి వార్తల్లో నిలిచింది. కశ్మీర్‌లో ఇటీవల ఎన్‌కౌంటర్‌లో హతమైన నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ సభ్యుడు బషీర్‌ వనీకి మద్దతుగా వర్సిటీ విద్యార్థులు సభ ఏర్పాటుకు ప్రయత్నించారు. దీనిలో కీలమైన విద్యార్ధులు వసీం యాకుబ్‌ మాలిక్‌, అబ్దుల్‌ మీర్‌లపై యూపీ పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 124(ఎ) ప్రకారం రాజ్యద్రోహం కేసు నమోదు చేశారు. కశ్మీర్‌లో ఉగ్రవాద కర్యాకలపాలకు పాల్పడుతున్న వనీని ఇటీవల భద్రత ధళాలు మట్టుపెట్టిన విషయం తెలిసిందే.

వనీ మృతికి నివాళిగా అతని మద్దతు దారులు కొంతమంది వర్సిటీలో సమావేశం నిర్వహించి.. దేశ సమగ్రతను దెబ్బతినే విధంగా నినాదాలు చేశారని పోలీసులు తెలిపారు. వనీ ఎన్‌కౌంటర్‌ తరువాత కొంత మంది కశ్మీరి యువకులు ఆయనకు మద్దతుగా సభ నిర్వహించాలని ప్రయత్నం చేశారని.. వారికి వర్సిటీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. విద్యార్థులపై రాజ్యద్రోహం కేసు పెట్టడంపై వర్సిటీ విద్యార్థి సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తమకున్న వాక్ స్వాతంత్ర్యన్ని ప్రభుత్వాలు హరిస్తున్నాయని విద్యార్థి సంఘం నేత ఫజీల్‌ హుస్సెన్‌ పేర్కొన్నారు.


పీహెచ్‌డీ వద్దని మిలిటెన్సీలోకి..
2016లో బుర్హాన్‌ వనీ హతమైన తరువాత మిలిటెన్సీ వైపు ఆకర్షితులైన విద్యావంతుల్లో బషీర్‌ వనీ ఒకడు. ముందునుంచి చదువుల్లో చురుకుగా ఉన్న బషీర్‌ వనీ ప్రతిష్టాత్మక సైనిక్‌ స్కూల్లో 11, 12వ తరగతులు పూర్తిచేశాడు. మెరిట్‌ విద్యార్థిగా పాఠశాల, కళాశాల రోజుల్లో ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. ఎన్‌సీసీ క్యాడెట్‌గా పంద్రాగస్టు, రిపబ్లిక్‌ డే కవాతుల్లో కూడా పాల్గొన్నాడు. 2010, 2016లో కశ్మీర్‌ లోయలో చెలరేగిన తీవ్ర నిరసనల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటి వాడు, అలీగఢ్‌ యూనిర్సిటీలో పీహెచ్‌డీ చదువుతుండగా 2017 చివరన దక్షిణ కశ్మీర్‌కు చెందిన కొందరు విద్యార్థులతో ఏర్పడిన పరిచయంతో మిలిటెన్సీలో చేరాడు. ఈ ఏడాది జనవరి 3న అలీగఢ్‌ వర్సిటీని వదిలి వెళ్లాడు. అతని పేరు ఇప్పటికీ వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో కనిపిస్తోంది. భూగర్భశాస్త్రంలో పీహెచ్‌డీ చదువుతున్న వనీకి భోపాల్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ‘బెస్ట్‌ పేపర్‌ ప్రజెంటేషన్‌’ అవార్డు కూడా దక్కింది.

హిజ్బుల్‌ టాప్‌ కమాండర్‌ వనీ హతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement