అండమాన్‌లో అమెరికన్‌ టూరిస్ట్‌ హత్య | American Tourist Killed In Andaman And Nicobar Islands | Sakshi
Sakshi News home page

అండమాన్‌లో అమెరికన్‌ టూరిస్ట్‌ హత్య

Nov 21 2018 12:49 PM | Updated on Apr 4 2019 3:21 PM

American Tourist Killed In Andaman And Nicobar Islands - Sakshi

క్రైస్తవ ప్రచారానికి వచ్చి..

న్యూఢిల్లీ : అండమాన్‌, నికోబర్‌ దీవుల్లో ఓ అమెరికన్‌ టూరిస్టును గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. బాధిత టూరిస్ట్‌ను జాన్‌ అలెన్‌గా గుర్తించారు. జాన్‌ హత్యకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు ఏడుగురు అనుమానితులను అరెస్ట్‌ చేశారు. బాధితుడు గతంలో ఐదు సార్లు అండమాన్‌కు వచ్చారని, క్రైస్తవ బోధనలను ఉత్తర సెంటినెల్‌ ద్వీపంలోని గిరిజనులకు అందుబాటులోకి తీసుకురావాలని తపన పడేవాడని స్ధానిక మీడియా పేర్కొంది.

జాన్‌ అలెన్‌ చిదియతపు ప్రాంతం నుంచి కొందరు మత్స్యకారుల సహకారంతో ఈనెల 16న ఉత్తర సెంటినెల్‌ ద్వీపానికి చేరుకున్నారు. ఉత్తర సెంటినెల్‌ ద్వీపంలో నివసించే తెగ  బయటి ప్రపంచంతో సంబంధాలు పెట్టుకునేందుకు ఇష్టపడదని చెబుతున్నారు. కాగా ఈ తెగలో కేవలం 50 మంది జనాభా ఉన్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement