కోపర్డీ రేప్, హత్య కేసులో ముగ్గురు దోషులు | All 3 Men In Maharashtra's Kopardi Gang-Rape, Murder Case Held Guilty | Sakshi
Sakshi News home page

కోపర్డీ రేప్, హత్య కేసులో ముగ్గురు దోషులు

Nov 19 2017 5:55 AM | Updated on Oct 8 2018 6:18 PM

All 3 Men In Maharashtra's Kopardi Gang-Rape, Murder Case Held Guilty - Sakshi

అహ్మద్‌నగర్‌(మహారాష్ట్ర): మహారాష్ట్రలోని కోపర్డీ గ్రామంలో సంచలనం సృష్టించిన 15 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో స్థానిక సెషన్స్‌ కోర్టు ముగ్గురిని దోషులుగా నిర్ధారించింది. 2016లో జరిగిన ఈ కేసులో రేప్, హత్య, నేరపూరిత కుట్ర అభియోగాలపై జితేందర్‌ బాబూలాల్‌ షిండే, సంతోష్‌ గోరక్‌ భావాల్, నితిన్‌ గోపినాథ్‌ భైలూమేలను దోషులుగా తేలుస్తూ సెషన్స్‌ కోర్టు శనివారం తీర్పునిచ్చింది. 2016 జూలైలో కోపర్డీలో మరాఠా వర్గానికి చెందిన ఈ బాలిక అత్యాచారం, హత్యకు గురైంది. నిందితులు బాలిక శరీరం మొత్తాన్ని తీవ్రంగా గాయపరిచారని, హత్య చేయడానికి ముందు ఆమె కాళ్లు, చేతులు విరిచేశారని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement