భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భౌతికకాయానికి త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. మంగళవారం మధ్యాహ్నం
న్యూఢిల్లీ : భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భౌతికకాయానికి త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. వాయుసేన విమానంలో కలాం పార్థీవ దేహం మంగళవారం మధ్యాహ్నం పాలెం విమానాశ్రయం చేరుకుంది. ఈ సందర్భంగా ఆర్మీ, నేవీ, వాయు సేనల అధ్యక్షులు.. కలాం భౌతికకాయంపై జాతీయ పతాకం కప్పి ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం రామేశ్వరంలో కలాం అంత్యక్రియల జరగనున్నాయి.