విద్యార్థులను చిదిమేసిన బొలెరో | 9 Dead, 20 Injured After Speeding SUV Runs Over School Children In Bihar | Sakshi
Sakshi News home page

విద్యార్థులను చిదిమేసిన బొలెరో

Feb 25 2018 2:58 AM | Updated on Feb 25 2018 9:35 AM

9 Dead, 20 Injured After Speeding SUV Runs Over School Children In Bihar - Sakshi

ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనం

ముజఫర్‌పూర్‌(బిహార్‌): రోజూలాగే స్కూల్‌ నుంచి ఇంటికి బయలుదేరిన విద్యార్థులపైకి బొలెరో వాహనం మృత్యువుగా దూసుకొచ్చింది. విద్యార్థులు రోడ్డు దాటుతుండగా జరిగిన ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతిచెందగా, 20 మంది గాయపడ్డారు. హృదయ విదారకమైన ఈ సంఘటన బిహార్‌లోని మిణాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది.

మధ్యాహ్నం స్కూల్‌ వదిలిపెట్టాక ఇంటికి బయలుదేరిన విద్యార్థులపైకి బొలెరో అదుపుతప్పి దూసుకొచ్చిందని ముజఫర్‌పూర్‌ ఎస్పీ వివేక్‌ కుమార్‌ తెలిపారు. దీంతో 9మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారన్నారు. ప్రమాదంతో ఆ ప్రాంతం రక్తసిక్తంగా మారిందని చెప్పారు. గాయపడిన 20 మందిని చికిత్స కోసం శ్రీ కృష్ణా మెడికల్‌ హాస్పిటల్‌కు తరలించామని, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement