ఉత్తరప్రదేశ్ కల్తీ మద్యం సంఘటనలో 37 మంది మృతి | 37 killed in Uttar Pradesh illicit liquor tragedy | Sakshi
Sakshi News home page

ఉత్తరప్రదేశ్ కల్తీ మద్యం సంఘటనలో 37 మంది మృతి

Oct 19 2013 3:40 PM | Updated on Sep 1 2017 11:47 PM

ఉత్తరప్రదేశ్లో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 37కు పెరిగింది.

ఉత్తరప్రదేశ్లో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 37కు పెరిగింది. అజంగఢ్ జిల్లా ముబారక్పూర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మరణించిన వారిలో ఎక్కువగా కార్మికులు, పేదలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మద్యం వ్యాపారులు నీళ్లలో స్పిరిట్ను కలిపి చౌక ధరకు విక్రయించడం ద్వారా పరిస్థితి విషమించినట్టు అధికారులు తెలిపారు.

ఈ సంఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంది. జిల్లా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఓం ప్రకాష్ సింగ్తో సహా పదిమంది అధికారుల్ని సస్పెండ్ చేసింది. న్యాయ విచారణకు యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement