24 గంటల్లో 279 మంది మృతి | 279 New Corona Deaths in Single Day | Sakshi
Sakshi News home page

24 గంటల్లో 279 మంది మృతి

Jun 10 2020 9:58 AM | Updated on Jun 10 2020 10:42 AM

279 New Corona Deaths in Single Day - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రోజులు గడుస్తున్న కొద్దీ దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9,985 కేసులు నమోదు కాగా, 279 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,76,583కి చేరగా.. మృతుల సంఖ్య 7,745కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,33,632 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా గడిచిన 24 గంటల్లో 1,45,216 మందికి కరోనా టెస్టులు చేశారు. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 50,61,332గా నమోదైంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. తాజా గణాంకాల ప్రకారం మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నిర్ధారణ అయ్యాయి. (వూహాన్‌ను అధిగమించిన ముంబై)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement