రైల్వే స్టేషన్‌లో భారీగా బంగారం స్వాధీనం | 25 kgs gold caught in delhi railway station | Sakshi
Sakshi News home page

రైల్వే స్టేషన్‌లో భారీగా బంగారం స్వాధీనం

Jul 14 2017 2:49 PM | Updated on Aug 2 2018 4:35 PM

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో పెద్ద మొత్తంలో బంగారం బయటపడింది.

న్యూఢిల్లీ: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో పెద్ద మొత్తంలో బంగారం బయటపడింది. సరైన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో బంగారం తరలిస్తున్న వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపడుతున్న డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ అధికారులు ఓ వ్యక్తి వద్ద నుంచి 25.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 7.54 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారాన్ని నిందితుడు నేపాల్‌ నుంచి దొంగచాటుగా తీసుకువస్తున్నట్లు తెలుసుకున్నారు. దీని వెనుక బంగారం స్మగ్లింగ్‌ ముఠా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పట్టుబడిన వ్యక్తి నుంచి మరిన్ని వివరాలు రాబట్టి మరికొందరిని అరెస్ట్‌ చేయనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement