ఆటో బోల్తా..10 మందికి తీవ్ర గాయాలు

నల్గొండ : చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్‌ వద్ద ఆదివారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో ప్రయాణిస్తున్న 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. చింతపల్లి నుంచి మాల్‌ వైపు వస్తోండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులంతా చింతపల్లి మండలం కూరంపల్లికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Read latest Nalgonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top