ఆ కామెంట్లను పట్టించుకోను : కత్రినా | Take the positives and avoid the criticism says Katrina Kaif | Sakshi
Sakshi News home page

ఆ కామెంట్లను పట్టించుకోను : కత్రినా

Jun 10 2017 4:37 PM | Updated on Oct 22 2018 6:05 PM

ఆ కామెంట్లను పట్టించుకోను : కత్రినా - Sakshi

ఆ కామెంట్లను పట్టించుకోను : కత్రినా

సోషల్‌ మీడియాలో వస్తున్న అన్ని విషయాలను పట్టించుకోవాల్సిన పనిలేదని చెబుతోంది నటి కత్రినా కైఫ్‌.

న్యూ ఢిల్లీ :
సోషల్‌ మీడియాలో వస్తున్న అన్ని విషయాలను పట్టించుకోవాల్సిన పనిలేదని చెబుతోంది నటి కత్రినా కైఫ్‌. సోషల్‌మీడియాలో వస్తున్న పాజిటివ్‌ కామెంట్లను మాత్రమే స్వీకరించి, వ్యక్తిగతంగా కించపరిచే వ్యాఖ్యలు, నెగటివ్‌ కామెంట్లను వదిలేస్తానని చెప్పింది. బాలీవుడ్‌ అందాల తార ప్రియాంక చోప్రా, ‘దంగల్‌’ ఫేం ఫాతిమా సనా షేక్‌పై సోషల్‌ మీడియాలో వస్తున్న నెగటివ్‌ కామెంట్లపై కత్రినా స్పందించింది. మన మంచి కోరే వారు, అభిమానుల కామెంట్లను మాత్రమే పరిగణలోకి తీసుకొని, పనికిరాని, చెత్త కామెంట్లను పట్టించుకోకూడదని సూచించింది.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జర్మనీ పర్యటనలో ఉన్న సమయంలో ‘బేవాచ్‌ స్టార్‌’, బాలీవుడ్‌ అందాల తార ప్రియాంక చోప్రా కలుసుకొని ఫొటో దిగిన తీరుపై సోషల్‌ మీడియా దుమ్మెత్తి పోసిన విషయం తెలిసిందే. మోకాళ్ల పైవరకు కనిపించేలా పొట్టి గౌను ధరించి మోదీ పక్కన కూర్చొని ఫొటో దిగడం పట్ల వారంతా అభ్యంతరం వ్యక్తం చేశారు.

అమితాబ్‌ బచ్చన్‌, ఆమిర్‌ ఖాన్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ సినిమా షూటింగ్‌ నిమిత్తం మాల్టాలోని సముద్ర తీరంలో ఫాతిమా సనా షేక్‌  స్విమ్‌సూట్‌ ధరించి ఓ ఫొటోషూట్‌ చేసింది. హీరోయిన్లు ఇలాంటి షూట్లు చేయడం సహజమే కానీ ఫాతిమా సనా ముస్లిం కావడం, అందులోనూ రంజాన్‌ మాసం కావడం వివాదానికి దారితీసింది. దీంతో చెయ్యకూడని పని చేశావంటూ నెటిజన్లు ఆమెపై నిప్పులు చెరిగారు.

కాగా, జగ్గా జాసూస్ చిత్రంలో బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ సరసన కత్రినా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం జూలై 14న విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement