
సన్నీలియోన్ అసభ్యతపై కేసు!
వెబ్సైట్లలోను, సోషల్ మీడియాలోను అసభ్యతను ప్రచారం చేస్తోందంటూ బాలీవుడ్ నటి సన్నీ లియోన్పై మహారాష్ట్రలోని థానె నగరంలో కేసు నమోదైంది.
వెబ్సైట్లలోను, సోషల్ మీడియాలోను అసభ్యతను ప్రచారం చేస్తోందంటూ బాలీవుడ్ నటి సన్నీ లియోన్పై మహారాష్ట్రలోని థానె నగరంలో కేసు నమోదైంది. డోంబివిలి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఆమెపై గురువారం రాత్రి నమోదైన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్లు 292, 292 ఎ, 294 రెడ్ విత్ 34 సెక్షన్లతో పాటు ఐటీ చట్టం, భారతీయ మహిళా ప్రాతనిధ్య చట్టంలోని సెక్షన్లు 3, 4 కింద కేసులు నమోదు చేశారు. అంజలీ పాలన్ (30) అనే గృహిణి చేసిన ఫిర్యాదుతో ఈ కేసులు నమోదయ్యాయి.
తాను ఇంటర్నెట్ చూస్తుంటే సన్నీ లియోన్కు చెందిన పలు అసభ్య చిత్రాలు, పోస్టులు కనిపించాయని ఆమె తెలిపారు. అలాగే ఆమె వెబ్సైట్ సన్నీలియోన్.కామ్ లో కూడా విపరీతమైన అసభ్య సమాచారం ఉందన్నారు. ఇలాంటి పోస్టుల వల్ల పిల్లల మెదళ్లు విషపూరితం అవుతాయని ఆమె తన ఫిర్యాదులో ఆందోళన వ్యక్తం చేశారు. డోంబివిలి పోలీసులు ఈ కేసును థానె సైబర్ క్రైం విభాగానికి బదిలీ చేశారు. రెండు వారాల క్రితం తన సినిమా 'ఏక్ పహేలి లీలా' సినిమా ప్రమోషన్ కోసం సన్నీలియోన్ థానె వెళ్లింది.