సెన్సార్ పూర్తి చేసుకున్న ‘2 కంట్రీస్’ | Sunil Starrer 2 Countries Censored | Sakshi
Sakshi News home page

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘2 కంట్రీస్’

Dec 20 2017 4:46 PM | Updated on Dec 20 2017 4:46 PM

Sunil Starrer 2 Countries Censored - Sakshi

దర్శకుడు ఎన్.శంకర్ స్వీయ దర్శకత్వంలో సునీల్ కథానాయకుడిగా మహాలక్ష్మీ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘2 కంట్రీస్’. సునీల్ సరసన మనీషా రాజ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని క్లీన్ యు సర్టిఫికెట్ సాధించి డిసెంబర్ 29న విడుదలకు సన్నద్ధమవుతోంది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘2 కంట్రీస్’కు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్, పోస్టర్, టీజర్, ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. 

‘జై బోలో తెలంగాణా, శ్రీరాములయ్యా, భద్రాచలం, జయం మనదేరా’ లాంటి సినిమాలతో తనదైన మార్క్ వేసిన శంకర్ ‘2 కంట్రీస్’తో మరోమారు ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన శంకర్..‘ఈ సినిమాను గ్రాండ్ విజువల్స్ తో తెరకెక్కించాము. ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరిగింది.సునీల్ కామెడీ టైమింగ్, స్టోరీ నేరేషన్ హైలైట్స్ గా నిలుస్తాయి. 

అలాగే.. 30 ఇయర్స్ పృధ్వీ, శ్రీనివాసరెడ్డిల కాంబినేషన్ సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. ఇక గోపీసుందర్ ఆర్.ఆర్ సినిమాలోని ఎమోషన్స్ ను హైలైట్ చేస్తుంది. ఈ సినిమా ప్రేక్షకుల్ని  ఆకట్టుకుంటుందన్న పూర్తి నమ్మకం మాకుంది. సెన్సార్ పూర్తయ్యింది, డిసెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది’ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement