గొప్ప సినిమా తీయడానికి ప్రయత్నించాం

గొప్ప సినిమా తీయడానికి ప్రయత్నించాం - Sakshi


- సందీప్ కిషన్

‘‘ ‘ప్రస్థానం’తో సందీప్ కిషన్ కెరీర్‌ను డిఫరెంట్‌గా స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత కూడా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు. తాజా చిత్రంపై ఎన్నో అంచనాలున్నాయి. క్లిష్టమైన పాయింట్‌తో సరికొత్త రీతిలో తెరకెక్కించిన సినిమా ఇది. తప్పకుండా ఈ సినిమా హిట్  కావాలని కోరుకుంటున్నా’’ అని దర్శకుడు గుణశేఖర్ అన్నారు. సందీప్ కిషన్, నిత్యామీనన్ జంటగా అంజిరెడ్డి ప్రొడక్షన్స్ పతాకంపై రాజసింహ తాడినాడ దర్శకత్వంలో బోగాది అంజిరెడ్డి నిర్మించిన చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’.



మిక్కీ జె మేయర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో సీడీని హీరో సాయిధరమ్‌తేజ్ ఆవిష్కరించి, దర్శకుడు బోయపాటి శ్రీనుకు అందజేశారు. ఈ సందర్భంగా సందీప్‌కిషన్ మాట్లాడుతూ- ‘‘ఒక మంచి సినిమా లేదా ఓ హిట్ సినిమా తీయడానికి చేసిన ప్రయత్నం కాదు. ఓ గొప్ప సినిమా చేయడానికి చేసిన ప్రయత్నమిది’’ అన్నారు. వినాయక్ మాట్లాడుతూ- ‘‘రాజసింహ ఏడేళ్ల క్రితమే ఈ కథ చెప్పాడు.



ఈ కథ ఎవరికైనా ఇవ్వాలని ప్రయత్నించాడు. తనే ఈ కథతో దర్శకునిగా మారడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘ఎక్కడా బోర్ కొట్టకుండా ఈ చిత్రాన్ని తీయడంలో రాజసింహ సక్సెస్ అయ్యారు. గ్రిప్పింగ్‌గా కథ రాసుకున్నారు’’ అని నిత్యామీనన్ చెప్పారు. దర్శకుడు మేర్లపాక గాంధీ, రాశీఖన్నా, రెజీనా పాల్గొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top