'ఆదిత్య 369'కు సీక్వెల్ | sequel to 'Aditya 369' | Sakshi
Sakshi News home page

'ఆదిత్య 369'కు సీక్వెల్

Sep 19 2013 4:37 PM | Updated on Aug 29 2018 1:59 PM

దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 81 ఏళ్ల వయసులో మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా ఆయన గతంలో తీసిన 'ఆదిత్య 369' సినిమాకు సీక్వెల్ తీసే యోచనలో ఉన్నారు.

దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 81 ఏళ్ల వయసులో మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా ఆయన గతంలో తీసిన 'ఆదిత్య 369' సినిమాకు సీక్వెల్ తీసే యోచనలో ఉన్నారు. టైమ్ మిషన్ కథాంశంగా 1991లో విడుదల ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఇందులో బాలకృష్ణ సరసన మోహిని హీరోయిన్గా నటించింది.

ఈ సినిమా రిలీజైన రెండు దశాబ్దాల తర్వాత సింగీతం సీక్వెల తీయాలని భావిస్తున్నారు.  దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇందులో కూడా టైమ్ మిషనే కథాంశమయినా స్ర్కీన్ ప్లే విభిన్నంగా ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు.  ఈ ప్రాజెక్టు గురించి బాలకృష్ణతో త్వరలో చర్చించనున్నట్టు చెప్పారు. ఆయన తాజాగా దర్శకత్వం వహించిన 'వెలకమ్ ఒబామా' సినిమా శుక్రవారం విడుదల కాబోతోంది.

Advertisement
 
Advertisement
Advertisement