సెకండ్‌ టర్న్‌

Samantha's U-Turn Second Schedule Begins - Sakshi

అతను పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌. ఆమె పవర్‌ఫుల్‌ జర్నలిస్ట్‌. ప్రెస్, పోలీస్‌ పవర్‌ కలిస్తే క్రిమినల్స్‌కి ఫీవరే. ఈ ఇద్దరూ కలిసి ఒక ఫ్లై ఓవర్‌పై జరుగుతున్న హత్యలను ఎలా ఛేదించారు? అనే అంశంతో పలు మలుపులతో రూపొందుతున్న చిత్రం ‘యు–టర్న్‌’. కన్నడ హిట్‌ మూవీ ‘యు–టర్న్‌’ తెలుగు, తమిళ భాషల్లో రీమేక్‌ అవుతోన్న సంగతి తెలిసిందే. కన్నడ వెర్షన్‌ను డైరెక్ట్‌ చేసిన పవన్‌ కుమార్‌నే తెలుగు, తమిళ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. సమంత, ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్‌ ముఖ్య తారలుగా శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మిస్తున్నారు.

ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో స్టారై్టంది. అంటే.. యు–టర్న్‌లో సెకండ్‌ టర్న్‌ స్టారై్టందన్న మాట. ‘‘ఒక ఫ్లై ఓవర్‌ మీద జరుగుతున్న మర్డర్‌ మిస్టరీస్‌ను ఛేదించే జర్నలిస్ట్‌ కథే ‘యు–టర్న్‌’. హైదరాబాద్‌లో వేసిన భారీసెట్‌లో సెకండ్‌ షెడ్యూల్‌ను స్టార్ట్‌ చేశాం. జర్నలిస్ట్‌గా సమంత, పోలీసాఫీసర్‌గా ఆది పినిశెట్టి కనిపించనున్నారు. ప్రస్తుతం ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నాం. సినిమాలో నరేన్, భూమిక పాత్రలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. తెలుగు నేటీవిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశాం. పవన్‌ కుమార్‌ బాగా తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు నిర్మాత శ్రీనివాస్‌. ఈ చిత్రానికి కెమెరా: నికేత్‌ బొమ్మి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top