నాగ్‌ మామ చాలెంజ్‌ యాక్సెప్టెడ్‌ | Samantha planted sapling  with King Nagarjuna | Sakshi
Sakshi News home page

నాగ్‌ మామ చాలెంజ్‌ యాక్సెప్టెడ్‌

Jul 11 2020 8:11 PM | Updated on Jul 11 2020 8:30 PM

Samantha planted sapling  with King Nagarjuna - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో అక్కినేని సమంత మొక్కలు నాటారు. టాలీవుడ్‌ సీనియర్‌ హీరో అక్కినేని నాగార్జున ఛాలెంజ్‌ను స్వీకరించిన  సమంత  శనివారం జూబీలీహిల్స్ లోని తన నివాసంలో తన కుటుంబ సభ్యులతో కలిసి మూడు మొక్కలు నాటారు. ఈ ఫోటోలను ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతోపాటు తన సహనటులు, మహానటి కీర్తి సురేష్, మరో హీరోయిన్‌ రష్మీక మందాన, తన స్నేహితురాలు శిల్పారెడ్డికి మూడు మొక్కలు నాటాల్సిందిగా సవాలు విసిరారు. (సమంత బ్యూటీ థెరపీ వీడియో )

ఈ సందర్భంగా జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని సమంత కొనియాడారు. అంతేకాదు  'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'  చెయిన్‌ను కొనసాగించేలా  ప్రతి ఒక్క అభిమాని మూడు మొక్కలు నాటాలంటూ  ఆమె తన అభిమానులకు పిలుపునిచ్చారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement