ఆగస్ట్‌ నుంచి నాన్‌స్టాప్‌గా... | rah tharun and konda vijaykumar new movie launch | Sakshi
Sakshi News home page

ఆగస్ట్‌ నుంచి నాన్‌స్టాప్‌గా...

Jun 20 2019 12:07 AM | Updated on Jun 20 2019 12:07 AM

rah tharun and konda vijaykumar new movie launch - Sakshi

విజయ్‌కుమార్, రాధామోహన్‌

రాజ్‌ తరుణ్‌ హీరోగా కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి బుధవారం కొబ్బరికాయ కొట్టారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ కె.కె. రాధామోహన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రాధామోహన్‌ మాట్లాడుతూ– ‘‘అధినేత, ఏమైంది ఈ వేళ, బెంగాల్‌ టైగర్, పంతం’ వంటి మంచి హిట్‌ చిత్రాల తర్వాత మా బేనర్‌లో చేస్తున్న మరోమంచి కథా చిత్రమిది.

ఆగస్ట్‌ నుంచి నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ జరుపుతాం’’ అన్నారు. ‘‘మూడేళ్లు కష్టపడి తయారు చేసిన కథ ఇది. కథ విని రాధామోహన్‌గారు వెంటనే సినిమా స్టార్ట్‌ చేద్దాం అన్నారు. రాజ్‌ తరుణ్‌కి ఇది చాలా మంచి సినిమా అవుతుంది. నా దర్శకత్వంలో వచ్చిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ కంటే మంచి కథ ఇది’’ అని కొండా విజయ్‌కుమార్‌ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్, కెమెరా: ఆండ్రూస్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement