పండగ ఆరంభం | Prathi Roju Pandage Movie Launch | Sakshi
Sakshi News home page

పండగ ఆరంభం

Jun 25 2019 2:41 AM | Updated on Jun 25 2019 2:41 AM

Prathi Roju Pandage Movie Launch - Sakshi

రాశీఖన్నా, సాయితేజ్, ‘దిల్‌’ రాజు, అల్లు అరవింద్, మారుతి, ‘బన్నీ’ వాసు

సాయితేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దాసరి దర్శకత్వం వహిస్తున్న ‘ప్రతిరోజు పండగే’ చిత్రం సోమవారం ఆరంభమైంది. ‘సుప్రీమ్‌’ వంటి హిట్‌ సినిమా తర్వాత మళ్లీ సాయి తేజ్, రాశీ ఖన్నా నటిస్తున్న చిత్రం ఇది. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2యూవీ పిక్చర్స్‌ పతాకంపై ‘బన్నీ’వాసు నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత ‘దిల్‌’ రాజు క్లాప్‌ ఇచ్చారు.

ప్రముఖ నిర్మాణ సంస్థలు జీఏ 2, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా జీఏ2యూవీ పిక్చర్స్‌ సంస్థగా ఏర్పడి సినిమాలు నిర్మిస్తున్నారు. గతంలో ఈ బ్యానర్‌ నుంచి మారుతి డైరెక్షన్‌లో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్‌’ సినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజా చిత్రంలో సత్యరాజ్, విజయ్‌ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్‌ అయ్యంగార్, ‘సత్యం’ రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, హరితేజ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఎస్‌.కె.ఎన్, సంగీతం: తమన్‌. ఎస్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బాబు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement