పాయల్‌ ఎక్స్‌ప్రెస్‌ | Payal Rajput Readying up for Manmadhudu 2 | Sakshi
Sakshi News home page

పాయల్‌ ఎక్స్‌ప్రెస్‌

Feb 19 2019 3:03 AM | Updated on Jul 15 2019 9:21 PM

Payal Rajput Readying up for Manmadhudu 2 - Sakshi

పాయల్‌ రాజ్‌పుత్‌

‘‘ఆర్‌ఎక్స్‌ 100’ సూపర్‌ సక్సెస్‌తో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయారు పాయల్‌ రాజ్‌పుత్‌. మొదటి సినిమాలోనే బోల్డ్‌గా నటించి ఇండస్ట్రీ, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారామె. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు సైన్‌ చేస్తారనుకుంటే కొంచెం సమయం తీసుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలకు సంతకాలు చేస్తున్నారు. మొదట రవితేజ ‘డిస్కో రాజా’ సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో ఒక హీరోయిన్‌గా ఎంపికయ్యారు. లేటెస్ట్‌గా నాగార్జున ‘మన్మథుడు 2’ , వెంకటేశ్‌ ‘వెంకీ మామ’లో హీరోయిన్‌గా కమిట్‌ అయ్యారీ బోల్డ్‌ బ్యూటీ. ఇలా టాప్‌ హీరోలు ముగ్గురితో సినిమాలు సంతకం చేసి బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు సక్సెస్‌ అయితే పాయల్‌ టాప్‌ లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఈజీ అనుకోవచ్చు. ప్రస్తుతం తమిళంలో ఉదయ్‌ నిధి స్టాలిన్‌తో ‘ఏంజిల్‌’ అనే సినిమాలో యాక్ట్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement