‘చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా.. ఏం కాదు’ | Naseeruddin Shah On Mob Killing In Bulandshahr | Sakshi
Sakshi News home page

Dec 21 2018 3:12 PM | Updated on Dec 21 2018 3:20 PM

Naseeruddin Shah On Mob Killing In Bulandshahr - Sakshi

ఓ పోలీసు అధికారి చావు కన్నా.. ఆవు మరణానికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాం. అసలు దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తలచుకుంటే భయంగా ఉందంటున్నారు బాలీవుడ్‌ ప్రముఖ నటుడు నసీరుద్దిన్‌ షా. రెండు వారాల క్రితం బులందషహర్‌ మూక దాడిలో.. జనాలు ఇద్దరు పోలీసు అధికారులపై దాడి చేసి చంపడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నసీరుద్దీన్‌ షా మాట్లాడుతూ.. ‘దేశంలో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేవారికి పూర్తిగా రక్షణ లభిస్తోంది. ఇప్పటికి అనేక ప్రాంతాల్లో పోలీసు అధికారి చావు కంటే కూడా ఆవు మరణం గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు.. దానికే  ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. నిజంగా ఇది చాలా విచారకరం’ అన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను చూస్తే చాలా భయంగా ఉంది.. ఇలాంటి సమాజంలో నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందోనని నాకు ఆందోళనగా ఉందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement